అమెరికాలో ప్ర‌వాసాంధ్రుల‌ కొవ్వొత్తుల ప్రదర్శనలు

ABN , First Publish Date - 2020-06-30T13:58:43+05:30 IST

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతాంగం చేస్తున్న పోరాటానికి జూలై 3వ తేదీతో 200రోజులు పూర్తికానున్నాయి.

అమెరికాలో ప్ర‌వాసాంధ్రుల‌ కొవ్వొత్తుల ప్రదర్శనలు

అమరావతి(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతాంగం చేస్తున్న పోరాటానికి జూలై 3వ తేదీతో 200రోజులు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా రైతులకు సంఘీభావంగా, అమరావతి రాజధానికి మద్దతుగా అమెరికాలోని 200 నగరాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ప్రవాసాంధ్రులు ఓ ప్రకటనలో తెలిపారు. తమ హక్కుల కోసం, కేంద్రీకృత పాలన, వికేంద్రీకృత అభివృద్ధి కోసం నినదిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-30T13:58:43+05:30 IST