వైభవంగా నృసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-01-25T06:24:29+05:30 IST

: మట్టపల్లి క్షేత్రంలో రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ సోమవారం వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, రక్షాబంధనం, రుత్వికాగ్వరణం, పంచగవ్యప్రాసన, మాంగల్యధారణ, తలంబ్రాల తంతును వైభవంగా నిర్వహించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు వితరణ చేశారు. కరోనా దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు శానిటైజర్లు, భౌతికదూరం, మా

వైభవంగా నృసింహుడి కల్యాణం
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి, జనవరి 24: మట్టపల్లి క్షేత్రంలో రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ సోమవారం వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహ వాచనం, రక్షాబంధనం, రుత్వికాగ్వరణం, పంచగవ్యప్రాసన, మాంగల్యధారణ, తలంబ్రాల తంతును వైభవంగా నిర్వహించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు వితరణ చేశారు. కరోనా దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు శానిటైజర్లు, భౌతికదూరం, మాస్క్‌ ధరించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్‌ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తీ, శేషగిరిరావు, శ్రీనివాసరావు, సీత, రాజష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T06:24:29+05:30 IST