కరెంటు అమ్ముతాం..!
ABN , First Publish Date - 2021-08-01T09:23:03+05:30 IST
దీర్ఘ, మధ్య, తాత్కాలిక ఒప్పందాలకు కరెంటు అమ్మిన తర్వాత కూడా మిగులుతున్న విద్యుత్తును బహిరంగ విపణిలో అమ్మాలని ఎన్టీపీసీ నిర్ణయించింది.
బహిరంగ విపణిలో విద్యుత్తు విక్రయానికి ఎన్టీపీసీ ప్రకటన
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దీర్ఘ, మధ్య, తాత్కాలిక ఒప్పందాలకు కరెంటు అమ్మిన తర్వాత కూడా మిగులుతున్న విద్యుత్తును బహిరంగ విపణిలో అమ్మాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. దీనికోసం అధిక మొత్తంలో కరెంటును కొనుగోలు చేసేవారు, పారిశ్రామిక వినియోగదారులు, డిస్కమ్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ఆసక్తి ఉన్న వారు తాము కోరిన చోటు నుంచి కరెంటును తీసుకోవచ్చు.