ఘనంగా ఎన్టీఆర్ జయంత్యోత్సవాలు

ABN , First Publish Date - 2020-05-28T20:25:40+05:30 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని అంబర్‌పేట్ నియోజకవర్గ నేతలు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. అంబర్‌పేట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సీనియర్ నాయకులు బిల్డర్ ప్రవీణ్... ఎన్టీఆర్‌కు ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.

ఘనంగా ఎన్టీఆర్ జయంత్యోత్సవాలు

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని అంబర్‌పేట్ నియోజకవర్గ నేతలు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. అంబర్‌పేట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సీనియర్ నాయకులు బిల్డర్ ప్రవీణ్... ఎన్టీఆర్‌కు ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.


ప్రవీణ్ మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తన ప్రాణాలు కూడా పార్టీ కోసమే త్యాగం చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ లాంటి ముఖ్యమంత్రి   ఎప్పటికీ ఉండబోడని, పేదల కోసం ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ నాయకుడూ చేయలేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.


విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. అలాగే ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.

Updated Date - 2020-05-28T20:25:40+05:30 IST