దుబాయ్‌లో ఘనంగా NTR శత జయంతి వేడుక

ABN , First Publish Date - 2022-06-20T22:15:50+05:30 IST

యూఏఈ NRI టీడీపీ ఆధ్వర్యంలో మహాపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుక పనోరమా హోటల్‌లో ఘనంగా జరిగింది.

దుబాయ్‌లో ఘనంగా NTR శత జయంతి వేడుక

యూఏఈ NRI టీడీపీ ఆధ్వర్యంలో మహాపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుక పనోరమా హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో షార్జా ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులు ఈపి జాన్సన్‌, ప్రిన్స్ ఎలవర్సన్, రావిళ్ల రమేష్ బాబు అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దేశవిదేశాల్లోని telugu వారికీ ఇంత గౌరవం లభిస్తోందంటే కేవలం ఎన్టీఆర్ గొప్పతనమేనని కొనియాడారు. సంస్కరణల రూపంలో తెలుగు ప్రజలకి అనేక ప్రయోజనాలు ఒనగూడేలా చేసిన మహాపురుషుడని ప్రశంసించారు. 


మరో తెలుగు యువత నాయకుడు కందుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా బ్రష్టుపట్టిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ఓడించి టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేసేవరకు శక్తివంచన లేకుండా ప్రతి ప్రవాసీయుడు ముందుండి పోరాడాలని సూచించారు. పార్టీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ ఆదేశాల మేరకు అతి త్వరలో యూఏఈ ప్రవాస టిడిపి కమిటీలను ప్రకటించబోతున్నామని తెలిపారు. అనంతరం పార్టీ పటిష్టత కోసం చేపట్టబోయే కార్యక్రమాలు గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నితిన్ బొల్లినేని, ఉదయ్ శంకర్ కాట్రగడ్డ, కుమార్, వినోద్ కుమార్, పూల హరి, అరే గోపి నాయుడు, శ్రీనివాస్, గౌతమ్ కుమార్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-06-20T22:15:50+05:30 IST