ఎన్టీఆర్ నన్ను సొంత బిడ్డలా ఆదరించారు: మాజీ మంత్రి
ABN , First Publish Date - 2020-05-28T18:11:29+05:30 IST
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని ...
నెల్లూరు: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని మాజీ మంత్రి, అఖిలభారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు తాళ్లపాక రమేష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనను సొంత బిడ్డలా ఆదరించారని అన్నారు. మరో మూడేళ్లు దాటితే శతజయంతి చేసుకోబోతున్నారని, ఈ సందర్భంగా మా దైవం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన ఆశీర్వాదం తమకు ఎల్లవేళల ఉండాలని, ఒక అభిమానిగా కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయనను కులుసుకున్నానని, అప్పటి నుంచి నా దైవంతో సంబంధం పెంచుకుంటూపోయాన్నారు. ఆయన ఎప్పుడు నెల్లూరు వచ్చినా మా ఇంటికి వచ్చేవారని రమేష్ రెడ్డి తెలిపారు.