ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన బాలయ్య
ABN , First Publish Date - 2020-05-28T13:21:23+05:30 IST
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ట్యాంక్బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్లో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించారు. పలు చోట్ల అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు.