ఎన్టీఆర్‌ మహనీయుడు

ABN , First Publish Date - 2022-01-19T06:25:13+05:30 IST

తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామారావు మహనీయుడని, ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ, తెలుగువారి హృద యాల్లో ఎప్పటికీ సజీవంగానే వుంటారని టీడీపీ పాలిట్‌ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు.

ఎన్టీఆర్‌ మహనీయుడు
నక్కపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేస్తున్న వంగలపూడి అనిత

తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు

టీడీపీ పాలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత

వాడవాడలా వర్ధంతి.. ఘనంగా నివాళులు


ఎస్‌.రాయవరం, జనవరి 18: తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామారావు మహనీయుడని, ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ, తెలుగువారి హృద యాల్లో ఎప్పటికీ సజీవంగానే వుంటారని టీడీపీ పాలిట్‌ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా ఎస్‌.రాయవరం మండలం కోనవానిపాలెంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏజెర్ల వినోద్‌రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, నాయకులు నల్లపరాజు వెంకట్రాజు, కర్రి చందు, వంగలపూడి గోవిందు, గుర్రం రామకృష్ణ, తన్నీరు ఎరకయ్య, అల్లు మోహన్‌, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


నక్కపల్లి: మండల కేంద్రంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అనిత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.  టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కురందాసు నూకరాజు, నాయకులు గింజాల లక్ష్మణరావు, కేవీ సత్యనారాయణ, కొప్పిశెట్టి బుజ్జి, వెలగా శ్రీనివాసరావు, కొరిమి సూర్య గణేశ్‌, పెదిరెడ్డి రమేశ్‌, అల్లాడ రాము, తాతారావు, ఆంజనేయులు పాల్గొన్నారు. 


పాయకరావుపేట: స్థానిక వై జంక్షన్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి లెక్కల గోవిందు, నాయకులు చింతకాయల రాంబాబు, బత్తిన అచ్చిరాజు, పల్లా విలియంకేరి, సూరా సుబ్రహ్మణ్యం, నాగం బుల్లిదొర, గుల్లా నాగరాజు, పెదిరెడ్డి పండు, కట్టా శ్రీను, మలిపెద్ది సతీశ్‌,   తదితరులు పాల్గొన్నారు.


పాయకరావుపేట రూరల్‌: మండలంలోని పాల్తేరు, అంకంపేట గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు దేవవరపు వెంకటరావు, కె.సత్తిబాబు, బుద్దాల చిట్టిబాబు, సత్యంకొండ, ఇసరపు తాతారావు, నారాయణరావు, పక్కుర్తి సూరాబాబు, తదితరులు పాల్గొన్నారు.


కోటవురట్ల: తెలుగుదేశం నాయకులు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ మండల అధ్యక్షుడు లాలం కాశీనాయుడు, నాయకులు జానకి శ్రీనివాసరావు, పి.సూర్యారావు, యలమంచిలి ప్రకాష్‌, బత్తుల అప్పారావు, పినపాత్రుని గుర్రయ్యదొర, జానకి హరి, గొట్టివాడ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T06:25:13+05:30 IST