పేదల పెన్నిధి ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2020-05-29T09:09:35+05:30 IST

బడుగులకు రాజ్యాధికారం కల్పించిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు.

పేదల పెన్నిధి ఎన్టీఆర్‌

మచిలీపట్నం టౌన్‌, మే 28 : బడుగులకు రాజ్యాధికారం కల్పించిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. బందరులో ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించారు. బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావు, పల్లపాటి సుబ్రహ్మణ్యం, గనిపిశెట్టి గోపాల్‌, వేముల బుజ్జి, మాధవరావు, గోపు సత్యనా రాయణ, బాబాప్రసాద్‌,  కాశీవిశ్వనాథం,  కాగిత వెంకటేశ్వరరావు,  పి.వి.ఫణికుమార్‌, గొర్రెపాటి గోపీచంద్‌  ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. 


నిమ్మకూరులో...   

   పామర్రు : ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్‌ బసవ తారకం దంపతుల విగ్రహాలకు నందమూరి శివరామకృష్ణ, సూర పనేని ఆంకినీడు, మన్మథరావు, లక్ష్మణస్వామీ, శరత్‌బాబు రఘు రామయ్య తదితరులు  నివాళులర్పించారు.  

Updated Date - 2020-05-29T09:09:35+05:30 IST