ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-01-19T05:57:18+05:30 IST

వంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషిచేయాలని టీడీపీ నాయకులు కోరారు. ఎన్టీఆర్‌ 26వ వర్థంతిని ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. నల్లగొండలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల మధు సూ

ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
నల్లగొండలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌: దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషిచేయాలని టీడీపీ నాయకులు కోరారు. ఎన్టీఆర్‌ 26వ వర్థంతిని ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మంగళవారం  ఘనంగా నిర్వహించారు. నల్లగొండలోని హైదరాబాద్‌ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల మధు సూదన్‌రెడ్డి, కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, ఆకునూరి సత్యనారాయణ, కూరెళ్ల విజయ్‌కుమార్‌, గుండు వెంకటేశ్వర్లు, ఎంఏ రఫిక్‌ పాల్గొన్నారు. కొండమల్లేపల్లిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి టీడీపీ నాయకులు నివాళుల ర్పించారు. నకిరేకల్‌లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో నక్క రాంభనేష్‌, పసుపులేటి కృష్ణారెడ్డి, దొమ్మాటి సైదులు, కొండె ప్రవీణ్‌, లతీఫ్‌ పాల్గొన్నారు. గుర్రంపోడు, తిరుమల గిరి(సాగర్‌), కట్టంగూర్‌ మండలాల్లో,  చిట్యాలల మండలంలోని గుండ్రాంపల్లిలో, టీడీపీ నాయకులు నివాళులర్పించారు. మిర్యాలగూ డలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసుల సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. మునుగోడులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్‌ నివాళులర్పించారు. పేదలకు పండ్లు, బ్రెడ్లు పంచారు. మర్రిగూడలోని ఎన్టీఆర్‌ విగ్రహా నికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు. వేములపల్లి, దామరచర్ల, కట్టంగూర్‌ ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించారు. నిడమనూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మువ్వా అరుణ్‌కుమార్‌ రక్తదానం చేశారు. చింతపల్లిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎన్‌. ప్రసాద్‌ నివాళులర్పించారు. దేవరకొండలో టీడీపీ జిల్లా నాయకుడు వస్కుల కృష్ణయ్య ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. చండూరలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు నివాళులర్పించి, అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కలి ఐ లయ్యయాదవ్‌, ఎర్రజెల్ల లింగయ్య, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:57:18+05:30 IST