దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు... 39,795 మంది మృతి!
ABN , First Publish Date - 2020-08-05T16:32:41+05:30 IST
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 52,509 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 52,509 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 19,08,255 కు చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 12,82,216 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ఈ వ్యాధి కారణంగా 857 మంది రోగులు మృతిచెందగా, ఇప్పటివరకు 39,795 మంది రోగులు మరణించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్ మాదిరిగానే మారుతోంది. బ్రెజిల్లో కొత్తగా 51,603 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రెజిల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,01,921 దాటింది. గడచిన 24 గంటల్లో 1,154 మంది మృతి చెందగా, దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 95,819 కు చేరుకుందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.