22,95,941
ABN , First Publish Date - 2022-01-25T04:34:10+05:30 IST
22,95,941
22,95,941
- ఇదీ జిల్లాలో ఓటర్ల సంఖ్య
- మహిళలే అధికం
- నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
(కలెక్టరేట్, జనవరి 24)
జిల్లా ఓటర్ల లెక్క తేలింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ తాజాగా సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం 22,95,941 మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు. ఇందులో పురుషులు 11,36,097 మంది, మహిళలు 11,42,146 మంది ఉన్నారు. ఇతరులు 270 మంది ఉండగా, ఎన్ఆర్ఐలు 80 మంది, సర్వీసు ఓటర్లు 17,348 మంది ఉన్నట్టు కలెక్టర్ వెల్లడించారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 6,049 మంది అధికంగా ఉన్నారని తెలిపారు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి ఐదు నాటికి 23,181 మంది ఓటర్లు పెరిగారని వివరించారు. కొవిడ్ నిబంధనల నడుమ మంగళవారం శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
ఓటర్ల జాబితా వివరాలు
---------------------------------------------------------------------------------------
నియోజవర్గం పురుషులు స్త్రీలు ఇతరులు ఎన్.ఆర్.ఐ సర్వీసు ఓటర్లు మొత్తం ఓటర్లు
--------------------------------------------------------------------------------------
ఇచ్ఛాపురం 1,27,530 1,32,284 21 09 1,880 2,61,724
పలాస 1,06,136 1,09,137 47 0 2,972 2,18,292
టెక్కలి 1,18,035 1,16,964 20 13 2,872 2,37,904
పాతపట్నం 1,13,072 1,12,522 18 08 1.807 2,27,427
శ్రీకాకుళం 1,33,082 1,34,443 42 20 1,213 2,68,800
ఆమదాలవలస 97,623 97,921 41 04 2.158 1,97,747
ఎచ్చెర్ల 1,20,666 1,17,702 26 03 877 2,39,274
నరసన్నపేట 1,06,593 1,06,725 18 03 2.187 2,15,526
రాజాం 1,15,950 1,13,288 28 17 780 2,30,063
పాలకొండ 97,410 1,01,160 09 03 602 1,99,184
--------------------------------------------------------------------------------------------------
మొత్తం 11,36,097 11,42,146 270 80 17348 22,95,941
--------------------------------------------------------------------------------------------------