పెళ్లి చేసుకుంటానని మోసం.. మహిళ ఆత్మహత్య..
ABN , First Publish Date - 2021-06-08T16:59:48+05:30 IST
డాక్టర్ అక్రమ్ అలీ హెల్త్ కేర్లో నర్సుగా పనిచేస్తోంది.
హైదరాబాద్ సిటీ/చాదర్ఘాట్ : పెళ్లి చేసుకుంటానని మోసం చేసినందుకు మనస్థాపం చెంది ఓ మహిళ యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిదిలో ఆదివారం రాత్రి జరిగింది. మలక్పేట ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మోయిన్ బాగ్ నివాసి నుస్రత్బేగం(28) డాక్టర్ అక్రమ్ అలీ హెల్త్ కేర్లో నర్సుగా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం వివాహం చేసుకోగా భర్తనుంచి విడి పోయింది. తర్వాత మహ్మద్ ఐజాజ్ అహ్మద్తో పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకోమనగా ఐజాజ్ నిరాకరించడంతో తనను మోసం చేశాడంటూ తీవ్ర మనస్థాపానికి గురైన నుస్రత్మలక్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బేగం ఆత్మహత్యకు కారకుడైన ఐజాజ్ అహ్మద్పై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.