నిమ్స్‌ డైరెక్టర్‌కు నర్సుల సమ్మె నోటీస్‌

ABN , First Publish Date - 2020-10-25T07:26:41+05:30 IST

నిమ్స్‌ నర్సెస్‌ యూనియన్‌ సభ్యులు ఆస్పత్రి డైరెక్టర్‌కు శనివారం సమ్మె నోటీస్‌ ఇచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సంబంధించిన ఇన్సెంటివ్‌లు, కొవిడ్‌-19 సమయంలో రావాల్సిన ఇన్సెంటివ్‌లు ఐదు నెలలుగా పెండింగ్‌లో

నిమ్స్‌ డైరెక్టర్‌కు నర్సుల సమ్మె నోటీస్‌

సనత్‌నగర్‌, అక్టోబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ నర్సెస్‌ యూనియన్‌ సభ్యులు ఆస్పత్రి డైరెక్టర్‌కు శనివారం సమ్మె నోటీస్‌ ఇచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సంబంధించిన ఇన్సెంటివ్‌లు, కొవిడ్‌-19 సమయంలో రావాల్సిన ఇన్సెంటివ్‌లు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ఆశాలత తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై డైరెక్టర్‌ను ఒకసారి కలిసి బకాయిల గురించి చెప్పామన్నారు. ఎంతో కాలంగా విధులు నిర్వహిస్తున్న నర్సులకు ఏ కారణం లేకుండా పదోన్నతులు ఆపారని వైస్‌ ప్రెసిడెంట్‌ ఎలిజబెత్‌ రాణి అన్నారు.  ఇన్సెంటీవ్‌లు తక్షణమే చెల్లించకుంటే నవంబర్‌ 7వ తేదీ నుంచి సమ్మె నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఆస్పత్రి యాజమాన్య తీరును నిరసిస్తూ శనివారం నుంచి నల్ల బ్యాడ్జీలు ధరిస్తున్నామన్నారు. సమ్మె నోటీస్‌ ఇచ్చిన వారిలో వైస్‌ ప్రెసిడెంట్‌లు రాణి, పుణ్యవతి, జనరల్‌ సెక్రెటరీ విజయకుమారి, జాయింట్‌ సెక్రెటరీలు సౌజన్య, ధనలక్ష్మి, సరస్వతమ్మ, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీలు స్లేవమ్మ, ఎస్తేర్‌,  కృష్ణ, ట్రెజరర్‌ సుశీల కుమారి, అడ్వైజరీ కమిటీ సభ్యులు వీఎస్‌ అశోక్‌ కుమార్‌, శ్యామలబాయి, నాగవర్థిని, ఊర్మిళాదేవి, ఫాతిమా, ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ మెంబర్లు, నర్సులు ఉన్నారు. 

Updated Date - 2020-10-25T07:26:41+05:30 IST