నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

ABN , First Publish Date - 2020-09-26T08:07:33+05:30 IST

నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మేయర్‌ నీతు కిరణ్‌, కార్పొరేషన్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 25: నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మేయర్‌ నీతు కిరణ్‌, కార్పొరేషన్‌ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివైడర్‌ మధ్యలో నాటి న మొక్కలకు డ్రిప్‌ సిస్టం ద్వారా నీటిని అందజేయాలని, డ్రిప్‌ సిస్టం లేని వాటికి ట్రాక్టర్‌ల ద్వారా నీటిని అందించాలన్నారు.


వాటర్‌ ఫౌంటెన్‌లు, సెంటర్‌ మీడియం, వీధి లైట్‌ల నిర్వహణ పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రజలకు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు జరగకుండా  నిత్యం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ శ్రీహరి, డీఈ రషీద్‌, ఇనాయత్‌ ఖరీం, సాగర్‌, ముస్తాక్‌, సుదర్శన్‌, సునీత, ఆర్‌ అండ్‌ బి ఈఈ రాంబాబు, డీఈ రాజేంధర్‌, సుధాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ మురళీమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T08:07:33+05:30 IST