పొలాల్లో గడ్డికి నిప్పంటించొద్దు

ABN , First Publish Date - 2020-09-26T08:01:35+05:30 IST

వర్షాకాలం పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు పొలాల్లో గడ్డికి ని ప్పు అంటించవద్దని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు.

పొలాల్లో గడ్డికి నిప్పంటించొద్దు

నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి


నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 25: వర్షాకాలం పంట చేతికి వచ్చిన తర్వాత రైతులు పొలాల్లో గడ్డికి ని ప్పు అంటించవద్దని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. రోడ్లు, పొలం గట్ల వద్ద హరితహారం మొక్కలు ఉ న్నందున గడ్డిని కాల్చవద్దన్నారు. గడ్డిని కాల్చడం వల్ల  మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని ఈ విషయాన్ని రైతులు గ్రహించాలన్నారు.


పంట చేతికి వచ్చిన త ర్వాత మిగిలిన వ్యర్థాలు, చెత్త, గడ్డిని కంపోస్ట్‌ ఎరువుగా తయారుచేసుకోవాలన్నారు. ఒకవేళ రైతులెవరైనా వినకపోతే రూ.5వేల జరిమానా వేస్తామన్నారు. గడ్డిని పొ లాల్లో కాల్చడం వల్ల భూసారం తగ్గుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్‌, పాలకవర్గం, హరితహారం కమిటీ స భ్యులు శివారు ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. 


 వారం రోజుల్లో రుణం మంజూరు చేయాలి

వీధి వ్యాపారుల రుణాలను ఆపకూడదని, ప్రతీ ఒ క్కరికీ సోమవారంలోగా మంజూరయ్యేలా చూడాలని క లెక్టర్‌ నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. శుక్రవా రం ఆయన బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో చర్చిం చారు. మెప్మా ద్వారా నిజామాబాద్‌ మున్సిపాలిటీలో 7, 754, బోధన్‌ మున్సిపాలిటీలో 4,137, ఆర్మూర్‌ మున్సిపా లిటీలో 3,363, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో 774 మంది వీ ది వ్యాపారులను గుర్తించామన్నారు.


నిజామాబాద్‌లో 3,540, బోధన్‌లో 1,941, ఆర్మూర్‌లో 1,292, బీమ్‌గల్‌లో 419 మందికి రుణాలు మంజూరయ్యాయన్నారు. మిగిలి న వారికి కూడా మంజూరు చేయాలని కలెక్టర్‌ సూచిం చారు. ఈ సమావేశంలో ఏల్డిఎం జయ సంతోషి, నిజా మాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, బ్యాం కు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-26T08:01:35+05:30 IST