మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరం

ABN , First Publish Date - 2021-07-25T04:49:09+05:30 IST

పట్టణంలోని కొత్త డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేర కు కమిషనర్‌ రాఽధను కలిసి వినతి పత్రం అందజేశారు.

మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరం
కమిషనర్‌కు వినతి పత్రం అందజేస్తున్న పురప్రజలు

ప్రొద్దుటూరు, జూలై 24: పట్టణంలోని కొత్త డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేర కు కమిషనర్‌ రాఽధను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌లో వెదుర్ల బజార్‌, గౌరమ్మకట్టవీధి రోడ్ల విస్తరణ 60 అడుగులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారని ఈ రోడ్లలో గతంలో బస్సులు, లారీలు తిరుగుతున్నప్పుడే 40 అడుగుల వెడల్పు ఉండేదని, ప్రస్తుతం ఈ వీధుల్లో ఆటో లు,  కార్లు తప్ప భారీ వాహనాలు నడవడంలేదన్నారు. ఈ ప్రాంతమంతా ఓల్డ్‌బిల్డప్‌ ఏరియా కాబట్టి రోడ్డు విస్తరణ మొదలు పెడితే కొన్ని గృహాలు పూర్తిగా  పోయే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం పట్టణం చుట్టూ బైపాస్‌ ఏర్పడింది కావున పాత ఊరిలో ఉన్న రోడ్లకు విస్తరణ ప్రసక్తే అవసరం లేదని వారన్నారు. 

Updated Date - 2021-07-25T04:49:09+05:30 IST