స్థానిక సంస్థల్లో అభ్యంతరాలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-22T06:50:22+05:30 IST

స్థానిక సంస్థల్లోని అభ్యంతరాలను అధి కారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.

స్థానిక సంస్థల్లో అభ్యంతరాలను పరిష్కరించాలి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

-   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 21: స్థానిక సంస్థల్లోని అభ్యంతరాలను అధి కారులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో శుక్రవారం  స్థానిక సంస్థల జిల్లా అఽధికా రులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. శాఖల వారీగా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిందేందుకు  ప్రణాళిక రూపొందించాలన్నారు.  సమావేశంలో జిల్లా ఆడిట్‌ అధికారి స్వప్న, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, దేవాలయ శాఖ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:50:22+05:30 IST