అభివృద్ధి పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-08-14T11:16:12+05:30 IST

మండలంలోని దొన్కల్‌ గ్రామంలో గురువారం పలు అభివృద్ధి పనులను డీఆర్‌డీవో రమేష్‌రాథోడ్‌ పరిశీలించారు.

అభివృద్ధి పనుల పరిశీలన

మోర్తాడ్‌, ఆగస్టు13: మండలంలోని దొన్కల్‌ గ్రామంలో గురువారం పలు అభివృద్ధి పనులను డీఆర్‌డీవో రమేష్‌రాథోడ్‌ పరిశీలించారు. గ్రామంలో నిర్మిం చిన వైకుంఠధామాన్ని పరిశీలించారు. అనంతరం డంపింగ్‌యార్డులో తడిపొడి చెత్త వే రు చేసి వాటిని పరిశీలించారు. రెవెన్యూ ప్లాంటేషన్‌, కమ్యూనిటీ ప్లాం టేషన్‌ గ్రా మంలో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. శ్మశాన వాటిక ఆ వర ణలో రమేష్‌రాథోడ్‌ మొక్కలు నాటారు. అనంతరం గ్రామపంచాయతీలో రికా ర్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ కత్తి ముత్తె న్న, ఉపసర్పంచ్‌ పాశపు మల్లేష్‌, కార్యదర్శి ఎండీ ఖాన్‌, కృష్ఱయ్య పాల్గొన్నారు.


చంద్రాయన్‌పల్లి, అన్సాన్‌పల్లి గ్రామాల్లో..

ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి, అన్సాన్‌పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను గురువారం జిల్లా ప్రణాళిక అధికారి శ్రీరాములు పరిశీలించారు. పల్లె ప్ర గతి ఆడిట్‌లో భాగంగా గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, కం పోస్ట్‌ షెడ్‌, డంపింగ్‌ యార్డుల పనులను పరిశీలించారు. వారంలోగా పెండింగ్‌పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్‌వో గంగాధర్‌, మండల గణాంక అధికారి రా జు, సర్పంచ్‌ లలిత, కా ర్యదర్శి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-14T11:16:12+05:30 IST