వన్డేల్లో పునరాగమనమే ప్రధాన లక్ష్యం: రహానే
ABN , First Publish Date - 2020-08-03T02:58:03+05:30 IST
వచ్చే క్రికెట్ సీజన్లో వన్డే జట్టులో పునరాగమనానికే తన తొలి ప్రాధాన్యమని భారత బ్యాట్స్మెన్ అజింక్య రహానే తెలిపాడు.
ముంబై: వచ్చే క్రికెట్ సీజన్లో వన్డే జట్టులో పునరాగమనానికే తన తొలి ప్రాధాన్యమని భారత బ్యాట్స్మెన్ అజింక్య రహానే తెలిపాడు. 2018లో రహానే తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత వన్డే జట్టులో అతనికి అవకాశం లభించలేదు. దీనిపై స్పందించిన రహానే.. ‘వన్డేల్లో నా రికార్డు బాగుంది. జట్టులో స్థానం కోల్పోవడానికి మూడు-నాలుగేళ్ల నుంచి మంచి ప్రదర్శనే చేస్తూ వచ్చా. అందుకే ఈసారి వన్డే జట్టులో స్థానం సంపాదించడమే నా ప్రధాన లక్ష్యం’ అని వెల్లడించాడు. ఇప్పటి వరకూ 90 వన్డే మ్యాచులు ఆడిన రహానే 2.962 పరుగులు చేశాడు.