ఒడిశా మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-04-21T05:07:57+05:30 IST
మండలంలోని నారిపేటలో ఒడిశా మద్యం ఎస్ఈబీ అధికారులు మంగళవా రం స్వాధీనం చేసుకున్నారు.
ఆమదాలవలస: మండలంలోని నారిపేటలో ఒడిశా మద్యం ఎస్ఈబీ అధికారులు మంగళవా రం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ అధికారుల కథనం మేరకు... నారిపేట గ్రామానికి చెందిన కె.పాపారావుతో కలిసి కొత్తవలసకు చెందిన పి.కల్యాణి ఒడిశాలో మద్యం కొనుగోలు చేశారు. ఈమద్యం నిల్వచేసినట్లు సమా చారం మేరకు సిబ్బంది మంగళ వారం దాడిచేశారు. నారిపేటలో ఇంటి యజమాని పాపారావును అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.ఈ మేరకు20 బాక్సుల్లో 1000 ఒడిశా మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ అక్కడ ధర ప్రకారం రెండులక్షలు, ఆంధ్రప్రదేశ్ ధర ప్రకారం నాలుగు లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ మేరకు వారిద్దరిని అదుపులోకి తీసుకొని మద్యాన్ని సీజ్చేసి కేసునమోదు చేసినట్లు ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ మూర్తిబాబు తెలిపారు.