49వ ఏట టెన్త్ పాసయిన ఎమ్మెల్యే... ఎన్నిమార్కులొచ్చాయంటే....
ABN , First Publish Date - 2021-08-25T16:15:29+05:30 IST
ఒడిశాలోని అధికార బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్...
భువనేశ్వర్: ఒడిశాలోని అధికార బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్ ఎట్టకేలకు టెన్త్ పాసయ్యారు. ఆయన తన 49 ఏట టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఒడిశా నుంచి టెన్త్ పరీక్షలు రాసిన 5,223 మందిలో పూర్ణచంద్ర స్వైన్ ఒకరు.
ఆయన ఒడిశా బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన టెన్త్ ఆఫ్లైన్ పరీక్షలకు హాజరై సఫలీకృతులయ్యారు. కరోనా కారణంగా ఒడిశాలో టెన్త్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించారు. అయితే ఈ విధానంలో పరీక్షలు రాసేందుకు అభ్యంతరం తెలిపిన విద్యార్థులకు బోర్డు ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించింది. ఈ విధంగా పరీక్షలు రాసిన ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్ ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 500 మార్కులకు గాను ఆయన 340 మార్కులు తెచ్చుకున్నారు.