సారా ప్యాకెట్లతో ఒడిశా వాసులు అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-10-25T10:41:45+05:30 IST

ఒడిశా నుంచి సాలూరుకు సారా ప్యాకె ట్లు తరలిస్తున్న ముగ్గురు ఒడిశావాసులు, ఒక సాలూరు వాసిని అరెస్ట్‌ చేసినట్టు సాలూరు ఎస్‌ఈబీ ..

సారా ప్యాకెట్లతో ఒడిశా వాసులు అరెస్ట్‌

సాలూరు రూరల్‌: ఒడిశా నుంచి సాలూరుకు సారా ప్యాకె ట్లు తరలిస్తున్న ముగ్గురు ఒడిశావాసులు, ఒక సాలూరు వాసిని అరెస్ట్‌ చేసినట్టు సాలూరు ఎస్‌ఈబీ సీఐ సీహెచ్‌ బాల నరసింహా చెప్పారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఎస్‌ఐ రాజశేఖర్‌, సిబ్బంది కామేశ్వరరావు, సుధాకర్‌, పావనిలు పట్టణంలో శనివారం పెట్రోలింగ్‌ నిర్వహించారు. అదే సమ యంలో ఒడిశా రాష్ట్రం పేటూరుకు చెందిన బంక కాండమ్మ, ఆనంద్‌, పరంజి హెబల్‌, సాలూరుకు చెందిన మైసర్ల శంకర్‌లు ఆటోలో 12 వందల సారా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుబడ్డా రని చెప్పారు. వారిని అరెస్ట్‌ చేసి, సారా ప్యాకెట్లు, ఆటోను సీజ్‌ చేశామని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-10-25T10:41:45+05:30 IST