wifeని అమ్మేసి సెల్ ఫోన్ కొనుక్కున్నాడు...

ABN , First Publish Date - 2021-10-23T17:57:13+05:30 IST

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు పెళ్లి అయిన నెల తర్వాత భార్యను రాజస్థాన్ వ్యక్తికి విక్రయించి,ఆ డబ్బుతో స్మార్ట్‌ఫోన్ కొన్న ఉదంతం...

wifeని అమ్మేసి సెల్ ఫోన్ కొనుక్కున్నాడు...

భువనేశ్వర్ (ఒడిశా) : ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు పెళ్లి అయిన నెల తర్వాత భార్యను రాజస్థాన్ వ్యక్తికి విక్రయించి,ఆ డబ్బుతో స్మార్ట్‌ఫోన్ కొన్న ఉదంతం దేశంలో సంచలనం రేపింది.ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు 26 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం నెలరోజులకే భార్యతో కలిసి ఇటుకబట్టీలో పనిచేయడానికి రాజస్థాన్ వెళ్లారు. రాజస్థాన్ రాష్ట్రం బరన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి ఒడిశా యువకుడు తన భార్యను రూ.1.8 లక్షలకు విక్రయించాడు. భార్యను విక్రయించగా వచ్చిన డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నాడు. యువకుడు డబ్బు జల్సా చేసి తిరిగి తన స్వగ్రామానికి వచ్చాడు. 


యువకుడి భార్య గురించి ఆమె కుటుంబసభ్యులు అడిగితే, ఆమె తనను విడిచిపెట్టిందని చెప్పాడు. యువకుడి మాట నమ్మని మహిళ కుటుంబసభ్యులు బలంగీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి కాల్ రికార్డులు పరిశీలించిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లు భార్యను విక్రయించాడని తేలింది. ముందు తాను కొన్న మహిళను విడిచిపెట్టనని రాజస్థాన్ వ్యక్తి చెప్పాడు.దీంతో బలంగీర్ పోలీసులు భర్త విక్రయించిన భార్యను అతి కష్టం మీద పట్టుకువచ్చారు. తాను రూ.1.8 లక్షలు ఇచ్చి మహిళను కొన్నానని బారన్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. అనంతరం భార్యను విక్రయించిన భర్త అయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. 


Updated Date - 2021-10-23T17:57:13+05:30 IST