ఒడిశా పర్యాటక శాఖ రోడ్‌ షో

ABN , First Publish Date - 2021-12-08T05:58:25+05:30 IST

పొరుగు రాష్ట్రాలతో అద్భుతమైన రోడ్డు వ్యవస్థతో ఒడిశా అనుసంధానం కలిగి ఉందని ఆ రాష్ట్ర పర్యాటకశాఖ అదనపు కార్యదర్శి దుర్గాప్రసాద్‌ మహాపాత్ర అన్నారు.

ఒడిశా పర్యాటక శాఖ రోడ్‌ షో
సమావేశంలో మాట్లాడుతున్న దుర్గాప్రసాద్‌ మహాపాత్ర

విశాఖపట్నం, డిసెంబరు 7: పొరుగు రాష్ట్రాలతో అద్భుతమైన రోడ్డు వ్యవస్థతో  ఒడిశా అనుసంధానం కలిగి ఉందని ఆ రాష్ట్ర పర్యాటకశాఖ అదనపు కార్యదర్శి దుర్గాప్రసాద్‌ మహాపాత్ర అన్నారు. ఒడిశా పర్యాటక శాఖ చేపట్టిన రోడ్డు షోను మంగళవారం ఆయన పార్కుహోటల్‌ వద్ద ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విశాఖ నగరం నుంచి ఒడిశాలోని దర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గం ద్వారా అరకులోయ, డియోమాలికొండలు, కోరాపుట్‌లోని డుడుమ జలపాతం, దరంగివాడి  అందమైన లోయలు, గోపాల్‌పూర్‌ బీచ్‌ అసియాఖండంలోని అతి పెద్ద ఉప్పునీటి సరస్సు చిలికాను సందర్శించవచ్చునన్నారు. ఒడిశాఖ పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ పీకే చాంద్‌ త్వరలో నిర్వహించనున్న ఎకోరిట్రీట్‌ ఒడిశా ఉత్సవం గురించి మాట్లాడుతూ కోణార్క్‌లోని మూడు బీచ్‌లు, గంజాంలోని పాటి-సోనాపూర్‌, భితర్కానికా నేషనల్‌ పార్కు, దరింగ్‌వాడలోని హిల్‌ స్టేషన్లు, హీరాకుడ్‌ ప్రాంతాల్లో  ఉత్సవ నిర్వహణకు ప్రణాళిక రూపొందించామన్నారు.  


Updated Date - 2021-12-08T05:58:25+05:30 IST