సరిహద్దు సమస్యపై ఒడిశా యువకుడి పాదయాత్ర
ABN , First Publish Date - 2021-10-17T05:15:59+05:30 IST
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ ఒడిశా రూర్కెలా ప్రాంతా నికి చెందిన సామాజిక కార్యకర్త ముక్తీకాంత్ బిస్వాస్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈనెల 2న బయలుదేరిన ఈ యువకుడు శుక్రవారానికి టెక్కలి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. అమరావతిలో సీఎం జగన్ని కలిసి ఈ సమస్య వివరించేందుకు పాదయాత్రగా బయలుదేరానన్నాడు.
టెక్కలి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ ఒడిశా రూర్కెలా ప్రాంతా నికి చెందిన సామాజిక కార్యకర్త ముక్తీకాంత్ బిస్వాస్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈనెల 2న బయలుదేరిన ఈ యువకుడు శుక్రవారానికి టెక్కలి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. అమరావతిలో సీఎం జగన్ని కలిసి ఈ సమస్య వివరించేందుకు పాదయాత్రగా బయలుదేరానన్నాడు. ఇటీవల ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవే దన వ్యక్తంచేశారు. పోలీసు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, దీనివల్ల వివాదాలు జరుగుతున్నాయన్నారు. అందు వల్ల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.