అభ్యంతరకర పోస్టులకు జైలు!
ABN , First Publish Date - 2020-11-23T07:16:39+05:30 IST
సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే కేరళలో భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఏ ప్రసార మాధ్యమం ద్వారానైనా ఎవరినైనా బెదిరిస్తూ, అవమానిస్తూ, పరువుకు భగం కలిగించేలా పోస్టులు పెడితే పోలీసులు బాధ్యులను అరెస్టు చేయొచ్చు...
తిరువనంతపురం, నవంబరు 22: సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడితే కేరళలో భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఏ ప్రసార మాధ్యమం ద్వారానైనా ఎవరినైనా బెదిరిస్తూ, అవమానిస్తూ, పరువుకు భగం కలిగించేలా పోస్టులు పెడితే పోలీసులు బాధ్యులను అరెస్టు చేయొచ్చు. వారికి ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ.10వేల దాకా జరిమానా లేదా రెండు శిక్షలూ విధించే అవకాశాలున్నాయి.