టీడీపీ అభ్యర్థి క్లినిక్ పై అధికారుల దాడులు
ABN , First Publish Date - 2021-03-09T20:43:05+05:30 IST
జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థికి చెందిన ఫిజియోథెరపీ క్లినిక్ పై వైద్యశాఖ
అనంతపురం: జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అభ్యర్థికి చెందిన ఫిజియోథెరపీ క్లినిక్ పై వైద్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన రాయదుర్గం పట్టణంలో సంచలనం కలిగిస్తోంది.రాయదుర్గం మున్సిపాలిటీలో 29వ వార్డు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఫిజియోథెరపీ క్లినిక్ ఉంది. అయితే ఈ క్లినిక్లో అడిషనల్ డీఎంహెచ్ఓ రామ సుబ్బారావు తనిఖీలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఫిజియోథెరపీ క్లినిక్లో తనిఖీ చేసినట్లు అడిషనల్ డీఎంహెచ్ఓ వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌన్సిల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వ్యక్తికి చెందిన ఫిజియోథెరపీ క్లినిక్ పై అధికారులు దాడులు నిర్వహించడం దారుణమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఒత్తిడి మేరకు టీడీపీ అభ్యర్థిని అధికారులు మానసిక వేధింపులకు గురి చేయడం సరికాదని ఆయన అన్నారు.