గడ్డిఅన్నారం మార్కెట్లో అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-09T23:13:56+05:30 IST

రైతుల ఫిర్యాదుల మేరకు గడ్డిఅన్నారం, కొత్తపేట పండ్ల మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ

గడ్డిఅన్నారం మార్కెట్లో అధికారుల తనిఖీలు

హైదరాబాద్: రైతుల ఫిర్యాదుల మేరకు గడ్డిఅన్నారం, కొత్తపేట  పండ్ల మార్కెట్‌లో తూనికలు, కొలతల శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలలో మార్కెట్‌లో ఉన్న రెండు వేయింగ్ మిషన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు. మిగితా దుకాణాదారుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్, సాధారణ తూనికలలో  అవకతవకలు ఉన్నాయని గుర్తించినట్లు వారు పేర్కొన్నారు.


ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పండ్లను మాగ బెట్టడానికి  చైనా నుంచి కెమికల్స్ తెప్పించి వాడుతున్నారని వారు తెలిపారు. దీంతో  రైతుల ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలలో 18 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పండ్ల నిల్వపై వ్యాపారులకు అవగాహన కుడా కల్పించామని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-09T23:13:56+05:30 IST