అధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2022-04-27T04:07:35+05:30 IST

చెక్‌పోస్టుల దగ్గర పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
జలాల్‌పూర్‌ చెక్‌పోస్టు దగ్గర పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ

నారాయణపేట రూరల్‌, ఏప్రిల్‌ 26 : చెక్‌పోస్టుల దగ్గర పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఎన్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని జలాల్‌పూర్‌ చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని, బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సూచించారు. ధాన్యం వాహనాలు వస్తే పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆరు చెక్‌పోస్టులను కర్ణాటక సరిహద్దుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట డీఎస్పీ కె.సత్యనారాయణ, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐలు సురేష్‌, శివనాగేశ్వర్‌ ఉన్నారు. 

Updated Date - 2022-04-27T04:07:35+05:30 IST