కేసీఆర్ ఇలాకాలో అధికారుల మందు.. చిందు

ABN , First Publish Date - 2021-06-12T00:09:08+05:30 IST

సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మందు పార్టీలో మునిగితేలారు. అది కూడా విధులకు ఎగనామం పెట్టి మందేసి చిందేశారు.

కేసీఆర్ ఇలాకాలో అధికారుల మందు.. చిందు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు మందు పార్టీలో మునిగితేలారు. అది కూడా విధులకు ఎగనామం పెట్టి మందేసి చిందేశారు. సీఎం కేసీఆర్ ఇలాక కొండపాకలోని ఓ మామిడితోటలో అధికారులు మందు పార్టీని నిర్వహించారు. కొవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తూ అధికారులు మందు పార్టీలో ఊగిపోయారు. కొండపాక మండల అధికారులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీకి మహిళా ఉద్యోగులు హాజరు కావడం గమనార్హం. జిల్లా ఎంపీఓలకు ఆహ్వానం అందగా.. డీఆర్‌డీ, ఓపీడీ, ఇన్‌ఛార్ట్ డీపీవో భోజనం చేసి వెళ్లినట్లు సమాచారం. పార్టీకి కొండపాక మండల పంచాయతీ కార్యదర్శులు చందాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 22 మండలాలకు చెందిన పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుకున్న ఏబీఎన్ ప్రతినిధులను మందు పార్టీ నిర్వహిస్తున్న మామిడితోటకు వెళ్లారు. దీన్ని గమనించిన ఉద్యోగులు పరారయ్యారు. ఈ ఘటనను జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.



Updated Date - 2021-06-12T00:09:08+05:30 IST