అధికారులు అభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2022-07-23T05:29:48+05:30 IST

మండలం అధికారులు అభివృద్ధికి సహకరించాలని ఎమ్మె ల్యే రాజేందర్‌రెడ్డి సూచించారు.

అధికారులు అభివృద్ధికి సహకరించాలి
మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

- మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

కోయిలకొండ,  జూలై 22 :  మండలం అధికారులు అభివృద్ధికి సహకరించాలని ఎమ్మె ల్యే రాజేందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ శశికళ అధ్యక్షతన మండల సర్వసభ్య నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా అధికారులను సమస్యల గురించి అడిగితే వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు. విద్యుత్‌ శాఖ అదికారులు గ్రామాల్లో విద్యుత్‌ అంతరా యం లేకుండా చుడాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయరాములు, తహసీల్దార్‌ ప్రేమ్‌రాజ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-23T05:29:48+05:30 IST