మంత్రికి ఓల మత్స్యకారుల వినతి

ABN , First Publish Date - 2021-12-02T07:15:31+05:30 IST

మండలంలోని ఓల గ్రామ మత్స్యకారులు, గంగపుత్ర ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ శేషాద్రి, మల్లయ్యలతో కలిసి మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు.

మంత్రికి ఓల మత్స్యకారుల వినతి
మంత్రికి వినతిపత్రాన్ని అందజేస్తున్న ఓల గ్రామ మత్స్యకారులు

కుంటాల, డిసెంబరు 1 : మండలంలోని ఓల గ్రామ మత్స్యకారులు, గంగపుత్ర ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ శేషాద్రి, మల్లయ్యలతో కలిసి మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. బుఽధవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామంలోని చెరువులీజు డబ్బుల చెల్లింపు గురించి వినతిపత్రం అందజేయగా, సానుకూలంగా స్పందించిన మంత్రి రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చి నట్లుగా తెలిపారు. ఓల సోషైటీ అధ్యక్షులు రామగిరి సురేష్‌, ఉపాధ్యక్షులు దుంపల శివకుమార్‌, కార్యదర్శి దుంపాల వినాయక్‌, నరాల సత్తయ్యలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T07:15:31+05:30 IST