రెండు సెకన్లకు ఓ ఈ-స్కూటర్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ పెట్టనున్న ఓలా!

ABN , First Publish Date - 2021-03-08T11:27:55+05:30 IST

ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు పెరగడంతో చాలా మంది చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా.. ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించిందట.

రెండు సెకన్లకు ఓ ఈ-స్కూటర్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ పెట్టనున్న ఓలా!

బెంగళూరు: ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు పెరగడంతో చాలా మంది చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా.. ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించిందట. దీనికోసం కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలో 500 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. ఇక్కడ ఓలా పెట్టే ఈ-స్కూటర్ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ ఫ్యాక్టరీలో ఏటా కోటి స్కూటర్లను ఉత్పత్తి చేయాలని ఓలా లక్ష్యంగా పెట్టుకుంది. 2022నాటికి ప్రపంచంలోని ఎలక్ట్రిక్ స్కూటర్లలో 15శాతం ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యేలా ఓలా ప్లాన్ చేస్తోంది. అంటే ప్రతి రెండు సెకన్లకు ఒక స్కూటర్ ఉత్పత్తి జరుగుతుందన్నమాట. 330 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ వచ్చే ఏడాదిలో విస్తరించాలనేది ఓలా యోచన.

Updated Date - 2021-03-08T11:27:55+05:30 IST