పాతకక్షలతో ఘర్షణ

ABN , First Publish Date - 2021-04-21T06:22:15+05:30 IST

నూజివీడు పట్టణంలో సోమవారం రాత్రి పాత కక్షల నేపథ్యంలోజరిగిన ఘర్షణలో మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్‌కుమార్‌ తెలిపారు.

పాతకక్షలతో ఘర్షణ

పోలీసుల అదుపులో 18 మంది

నూజివీడు, ఏప్రిల్‌ 20: నూజివీడు పట్టణంలో సోమవారం రాత్రి పాత కక్షల నేపథ్యంలోజరిగిన ఘర్షణలో మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్‌కుమార్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని వెలమపేటకు చెందిన మాదిరెడ్డి దుర్గారావు, లక్కోజి జీవన్‌కుమార్‌ల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఏరియా ఆసుపత్రి వద్ద జరిగిన ఈ ఘర్షణలో ఆసుపత్రి ఆవరణలో డోర్‌ అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. ఇరువర్గాలకు చెందిన వారు ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో  ఇద్దరికి గాయాలయ్యాయన్నారు. ఆసుపత్రి వైద్యుల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలకు చెందిన 18 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పట్టణంలో ఎవ్వరైనా ఉద్ధేశ పూర్వకంగా, పాతకక్షలతో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Updated Date - 2021-04-21T06:22:15+05:30 IST