కరోనా కల్లోలంతో గుండెపోటుతో వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-06-04T10:22:59+05:30 IST

మైలవరం మండల పరిధిలోని నవాబుపేటలో బుధవారం ఉదయానికి ఒకేసారి 10 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది.

కరోనా కల్లోలంతో గుండెపోటుతో వృద్ధుడి మృతి

మైలవరం, జూన్‌ 3 : మైలవరం మండల పరిధిలోని నవాబుపేటలో బుధవారం ఉదయానికి ఒకేసారి 10 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. వీరందరినీ అధికారులు, పోలీసులు కడపకు బస్సులో తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందిన పట్నం దేవరత్నం (64) తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బస్సు వద్దకు వెళ్లి కరోనా బాధితులందరినీ చూసి ఇంటికి వస్తుండగా గుండెనొప్పి అంటూ కిందపడిపోయాడు. స్థానికులు అతడిని జమ్మలమడుగులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే దేవరత్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2020-06-04T10:22:59+05:30 IST