గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-06-22T06:10:07+05:30 IST

నరేంద్రపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

పి.గన్నవరం, జూన్‌ 21: నరేంద్రపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. నరేంద్రపురానికి చెందిన షేక్‌ సాహెబ్‌ (61) సోమవారం తెల్లవారుజామున రహదారి చెంతనే ఉన్న పశువుల వద్దకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. సాహెబ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్న కుమార్తె షేక్‌ నూరాబీబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.సురేంద్ర తెలిపారు.



Updated Date - 2021-06-22T06:10:07+05:30 IST