40 ఏళ్ల తరువాత కలుసుకున్నారు..

ABN , First Publish Date - 2022-01-24T04:38:10+05:30 IST

40 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.. తమ తమ స్నేహితులను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు..

40 ఏళ్ల తరువాత కలుసుకున్నారు..
40 ఏళ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

1981– 82 పదవ తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనం


పాలకొల్లు రూరల్‌, జనవరి, 23 : 40 ఏళ్ల తరువాత కలుసుకున్నారు.. తమ తమ స్నేహితులను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు.. ఆనందం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యారు.. ఇదీ మండలంలోని లంకలకోడేరు జడ్పీ హైస్కూల్‌ 1981– 82 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో ఆదివారం కనిపించిన దృశ్యం.  ఉదయం నుం చి సాయంత్రం వరకూ అంతా ఆనందంగా గడిపారు.. ఆనాటి గురువులు 12 మందిని ఆహ్వానించి నూతన వస్త్రాలు అందించి సత్కరించారు.వెలివెల సర్పంచ్‌ కెల్లా సింహాచలం, వాటర్‌ వర్క్స్‌ డీఈ త్రినాఽథరావు, గ్రామ కార్యదర్శి బంగారు గోపి, నడింపల్లి శ్రీనివాసరాజు, దాట్ల పద్మ, ఎ.విజయలక్ష్మి, ఎం.కనకదుర్గ, శ్యామల, డి.ప్రసాద్‌, పి.సూర్యారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:38:10+05:30 IST