కరోనాతో వృద్ధురాలి మృతి.. ట్రాక్టర్లో శ్మశానవాటికకు తరలింపు
ABN , First Publish Date - 2020-08-03T16:58:45+05:30 IST
జిల్లాకేంద్రానికి చెందిన 70ఏళ్ల వృద్ధురాలు కరోనాతో ఆదివారం మృతిచెందింది. ఆమె కుమారుడు ములుగు ఏరియా వైద్యశాలలో పారామెడికల్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.. వారం క్రితం ఆయనకు పాజిటివ్ రాగా,
ములుగు(వరంగల్): జిల్లాకేంద్రానికి చెందిన 70ఏళ్ల వృద్ధురాలు కరోనాతో ఆదివారం మృతిచెందింది. ఆమె కుమారుడు ములుగు ఏరియా వైద్యశాలలో పారామెడికల్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.. వారం క్రితం ఆయనకు పాజిటివ్ రాగా, ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్న ఆయన భార్య, తల్లికి కూడా వైరస్ సోకింది. అప్పటినుంచి వారు హోంక్వారంటైౖన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధురాలు ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. విషయం తెలుసుకున్న డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య, రాయినిగూడెం వైద్యాధికారి పోరిక రవీందర్ ఆదివారం వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. జీపీ సిబ్బంది సాయంతో ట్రాక్టర్లో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. ఒకరిద్దరు బంధువులు మాత్రమే అంతిమసంస్కారాల్లో పాల్గొనేందుకు ముందుకు రాగా వైద్యాధికారులు సమకూర్చిన పీపీఈ కిట్లు ధరించారు. ఎక్స్కవేటర్తో గొయ్యితీసి వృద్ధురాలి మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతరం ఇంటి పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు.