ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ హాకీ మాజీ క్రీడాకారుడు రవీందర్ పాల్‌సింగ్ కరోనాతో మృతి

ABN , First Publish Date - 2021-05-08T16:40:24+05:30 IST

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, హాకీ మాజీ క్రీడాకారుడు రవీందర్ పాల్‌సింగ్(65) కరోనాతో శనివారం ఉదయం....

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ హాకీ మాజీ క్రీడాకారుడు రవీందర్ పాల్‌సింగ్ కరోనాతో మృతి

లక్నో : ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, హాకీ మాజీ క్రీడాకారుడు రవీందర్ పాల్‌సింగ్(65) కరోనాతో శనివారం ఉదయం మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్ లో బంగారుపతకాన్ని సాధించిన రవీందర్ పాల్ సింగ్ గత రెండు వారాలుగా కరోనాతో లక్నో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రవీందర్ పాల్ సింగ్ కరోనాతో గత నెల 24వతేదీన లక్నోలోని వివేకానంద ఆసుపత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకొని, పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అతన్ని నాన్ కొవిడ్ వార్డుకు బదిలీ చేశారు. అనంతరం రవీందర్ పాల్ పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో శుక్రవారం అతన్ని వెంటిలేటరుపై ఉంచారు.


1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో కూడా ఆడిన సింగ్ వివాహం చేసుకోలేదు. సింగ్ 1978 జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొన్నారు. హాకీ నుంచి నిష్ర్కమించాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.సీతాపూర్ లో జన్మించిన సింగ్ 1979 నుంచి 1984 వరకు క్రీడల్లో రాణించారు. రెండు ఒలింపిక్స్ తోపాటు కరాచీలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో (1980.1983), హాంకాంగ్ లో జరిగిన సిల్వర్ జూబ్లీ 10 దేశాల కప్, ముంబై ప్రపంచ కప్ , 1982 కరాచీలో జరిగిన ఆసియా కప్ పోటీల్లో సింగ్ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T16:40:24+05:30 IST