హైదరాబాద్‌లో ఆన్‌పాసివ్‌ కేంద్రం

ABN , First Publish Date - 2020-12-05T06:47:19+05:30 IST

అమెరికా కంపెనీ ఆన్‌పాసివ్‌ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రెడిక్టివ్‌, ఇంటలిజెంట్‌ బిజినెస్‌ ఆటోమేషన్‌ సేవలందిస్తున్న ఆన్‌పాసివ్‌కు భారత్‌లో ఇదే మొదటి సెంటర్‌..

హైదరాబాద్‌లో ఆన్‌పాసివ్‌ కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికా కంపెనీ ఆన్‌పాసివ్‌ హైదరాబాద్‌లో కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రెడిక్టివ్‌, ఇంటలిజెంట్‌ బిజినెస్‌ ఆటోమేషన్‌ సేవలందిస్తున్న ఆన్‌పాసివ్‌కు భారత్‌లో ఇదే మొదటి సెంటర్‌. ప్రస్తుతం 380 మంది నిపుణులతో కేంద్రాన్ని ప్రారంభించామని, 2021 చివరి నాటికి 1,000 మందికి పెంచుతామని ఆన్‌పాసివ్‌ సీఈఓ ఆష్‌ ముఫారహ్‌ తెలిపారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా మొదట హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో భారత్‌లో ఇతర నగరాలకు కూడా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు చెప్పారు. 

Updated Date - 2020-12-05T06:47:19+05:30 IST