20 రోజులుగా డివైడర్‌పైనే..

ABN , First Publish Date - 2022-01-27T07:54:05+05:30 IST

సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇరవై రోజులుగా ఓ వృద్ధురాలు కదల్లేని స్థితిలో డివైడర్‌పైనే కాలం వెళ్లదీస్తోంది. చలికి వణుకుతూ అక్కడే..

20 రోజులుగా డివైడర్‌పైనే..

  • కదల్లేని స్థితిలో వృద్ధురాలి దీనావస్థ


తాడేపల్లి టౌన్‌, జనవరి 26: సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇరవై రోజులుగా ఓ వృద్ధురాలు కదల్లేని స్థితిలో డివైడర్‌పైనే కాలం వెళ్లదీస్తోంది. చలికి వణుకుతూ అక్కడే బతుకీడుస్తోంది. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో ఆమె గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. నిత్యం వీవీఐపీలు, వీఐపీలు తిరిగే హై సెక్యూరిటీ జోన్‌ ఏరియాలో ఓ అభాగ్యురాలు ఇలా దీనావస్థను ఎదుర్కొంటోంది. ఒకరిద్దరు ఆమెకు తినడానికి ఇస్తున్నారు తప్పితే ఎవరూ ఆమె బాగోగులు పట్టించుకోవడంలేదు. కొందరు కప్పుకోవడానికి దుప్పటి, దోమ తెర ఏర్పాటు చేశారు. అయితే ఆమె ఎవరు.. ఇక్కడ ఎవరు వదిలేశారు.. ఏదైనా అనారోగ్య సమస్యలున్నాయా అనేది తెలియట్లేదు. దగ్గరకు వెళ్లేందుకు స్థానికులు సంశయిస్తున్నారు. నిస్సహాయురాలిగా మిగిలిన ఆ వృద్ధురాలికి ప్రభుత్వాధికారులు సాయమందించి.. ఆశ్రయం అందిస్తారని ఆశిద్దాం.

Updated Date - 2022-01-27T07:54:05+05:30 IST