నేను పురుషుడిని కాదంటూ భార్యకు అసలు నిజం చెప్పేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-06-20T01:55:52+05:30 IST

మొదట షాకైన హర్బి తర్వాత భర్తను అర్థం చేసుకుంది.

నేను పురుషుడిని కాదంటూ భార్యకు అసలు నిజం చెప్పేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వారిద్దరిదీ పదేళ్ల పరిచయం.. ఆరేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నారు.. రెండు నెలల తర్వాత హనీమూన్‌కు వెళ్లారు.. అక్కడ ఆమెకు తెలిసింది తన భర్త పురుషుడు కాదు.. ఓ ట్రాన్స్‌జెండర్ అని. మొదట షాకైనా.. ఆమె అతడిని వదులుకోలేదు.. భర్తను మహిళగా మార్చి మళ్లీ పెళ్లి చేసుకుంది. 


ఇంగ్లండ్‌కు చెందిన జాక్ (35), అమెరికాకు చెందిన హర్బీ (30) 2006లో ఆన్‌లైన్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. తరచుగా ఆన్‌లైన్‌లో కలుస్తూ 2010లో ప్రేమలో పడ్డారు. 2016లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రెండు నెలల తర్వాత హనీమూన్‌కు వెళ్లారు. అక్కడ హర్బీకి జాక్ అసలు విషయం చెప్పేశాడు. తను పురుషుడిని కానని, తనో ట్రాన్స్‌జెండర్‌నని చెప్పాడు. అలాగే శస్త్రచికిత్స చేసుకుని మహిళగా మారాలనుకుంటున్నట్టు చెప్పాడు.


మొదట షాకైన హర్బి తర్వాత భర్తను అర్థం చేసుకుంది. శస్త్రచికిత్సకు అవసరమైన డబ్బు ఇచ్చింది. మహిళగా మారిన తర్వాత జాక్, హర్బి మరోసారి పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీరి ప్రేమకథ చాలా ఫేమస్ అయింది. వీరికి బోలెడంత మంది అభిమానులున్నారు. 

Updated Date - 2021-06-20T01:55:52+05:30 IST