ట్రేడింగ్‌ పేరిట టోకరా.. 3.35 కోట్ల దోపిడీ

ABN , First Publish Date - 2021-04-13T12:21:55+05:30 IST

ఫార్మా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఇస్తామంటూ

ట్రేడింగ్‌ పేరిట టోకరా.. 3.35 కోట్ల దోపిడీ

  • ప్రధాన నిందితుడి అరెస్టు 


హైదరాబాద్‌ : ఫార్మా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఇస్తామంటూ ఆమాయకులను దోచుకున్న ఘటనలో ప్రధాన నిందితుడిని సీసీఎస్‌ డిటెక్టివ్‌ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కాచిగూడకు చెందిన తుర్లపాటి సతీష్‌(52), భార్య గాయత్రితో కలిసి ట్రేడింగ్‌ వ్యాపారం చేశారు. యూనిటస్‌ లైఫ్‌ సైన్సెస్‌ పేరిట ఫార్మా కంపెనీ స్థాపించి పెట్టుబడులు తీసుకున్నారు. వారి మాటలు నమ్మిన ఐదుగురు బాధితులు రూ. 3.35 కోట్లు పెట్టుబడి పెట్టారు. వారికి లాభాలతోపాటు అసలు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు సీసీఎస్‌ను ఆశ్రయించారు. గాయత్రిని ఫిబ్రవరి 19న అరెస్టు చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సతీష్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితులపై గతంలో కూడా మోసం చేసినట్లు బహదూర్‌పురా పీఎస్‌లో కేసు నమోదైంది. నిందితులు దందా వీడకుండా హెచ్‌ఎంఏ పేరిట మరో కంపెనీ స్థాపించి దోపిడికీ సిద్ధమయ్యారు. అదే సమయంలో పోలీసులకు పట్టుబడ్డారు.

Updated Date - 2021-04-13T12:21:55+05:30 IST