ఒక్కరోజే కరోనా బాధితులు 1,166
ABN , First Publish Date - 2020-09-23T07:28:04+05:30 IST
జిల్లాలో ఈనెల 21న ట్రూనాట్ ద్వారా చేసిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 261, రాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 905 మందికి కరోనా
కాకినాడ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 21న ట్రూనాట్ ద్వారా చేసిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 261, రాపిడ్ కిట్లతో చేసిన పరీక్షల్లో 905 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం 1,166 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య బట్టి వ్యాధి బారిన 88,955 మంది ప్రభావితమ య్యారు. కరోనాతో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందడంతో, ఈ సంఖ్య 493కి చేరింది. ప్రస్తుతం 76,580 మంది కోలుకున్నారు. యాక్టివ్గా 11,862 మంది ఉన్నారు.