సముద్రంలో పడవ మునక.. 12 మంది గల్లంతు !
ABN , First Publish Date - 2021-04-15T16:15:06+05:30 IST
అమెరికాలోని లూసియానా తీరంలో ఓ పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందగా, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
లూసియానా: అమెరికాలోని లూసియానా తీరంలో ఓ పడవ సముద్రంలో మునిగిపోయిన ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఒకరు మృతిచెందగా, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. తుపాను వల్ల లూసియానా తీరంలోని పోర్ట్ ఫార్చూన్ ఓడరేవుకు సమీపంలో ఈ ఘటన జరిగింది. తుపాను ధాటికి 90 కిమీ వేగంతో గాలులు వీయడంతోనే పడవ మునిగిపోయినట్లు కోస్ట్గార్డు అధికారులు వెల్లడించారు. బోర్డింగ్ సమయంలో పడవలో మొత్తం 19 మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాద ఘటన తర్వాత 12 మంది గల్లంతు కాగా, ఆరుగురిని కోస్ట్గార్డు సిబ్బంది రక్షించింది. ఒకరు చనిపోయారు. ఇక లూసియానాకు దక్షిణాన ఉన్న పోర్ట్ ఫార్చూన్ ఓడరేవు.. అమెరికా చమురు, గ్యాస్ పరిశ్రమకు ఒక ప్రధాన స్థావరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.