బస్సు, ట్రక్కు collision...ఒకరి మృతి, 14మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-15T12:48:54+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ జిల్లా అటల్ టన్నెల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

బస్సు, ట్రక్కు collision...ఒకరి మృతి, 14మందికి గాయాలు

మండీ (హిమాచల్ ప్రదేశ్): హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ జిల్లా అటల్ టన్నెల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ రోడ్ వేస్ కు చెందిన ప్రయాణికుల బస్సు అటల్ టన్నెల్ లో నుంచి వెళుతుండగా ఎదురుగా మండీకి వస్తున్న ట్రక్కు ఢీకొంది.అటల్ టన్నెల్ లో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ట్రక్కు డ్రైవరు గణేష్ కుష్వాహా (30) మరణించాడు. ఈ ప్రమాదంలో బస్సులో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 


టన్నెల్ లోపల అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదం వల్ల 3వ నంబరు జాతీయ రహదారిపై 2.7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. పోలీసులు టన్నెల్ లో నుంచి ప్రమాదానికి గురైన బస్సు, ట్రక్కులను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. వాహనాల అతి వేగం వల్లనే అటల్ టన్నెల్ లోపల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మండీ జిల్లా ఎస్పీ శాలినీ అగ్నిహోత్రి చెప్పారు. 


Updated Date - 2021-10-15T12:48:54+05:30 IST