కరోనాతో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-08-04T10:52:38+05:30 IST

మండలంలోని ఓ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడగా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌

కరోనాతో ఒకరి మృతి

వర్ని, ఆగస్టు 3 : మండలంలోని ఓ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడగా చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అనుమతి లభించకపోవడంతో అధికార యంత్రాంగమే హైద్రాబాద్‌లో సదరు వ్యక్తి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో కరోనాతో మృతిచెందిన వ్యక్తి కడచూపునకు నోచు కోలేక కుటుంబ సభ్యులు సోమవారం రోదనలు మిన్నంటాయి. కరోనాతో వ్యక్తి మృతి చెందడంతో ఆయన మృతికి పలువురు సంతాపం తెలియజేశారు. 


కరోనాతో హోటల్‌ నిర్వాహకుడి మృతి

బోధన్‌: బోధన్‌ కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో హోటల్‌ నడుపుతున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో హోటల్‌ నిర్వహిస్తున్నాడు. గత వారం రోజులుగా జ్వరం, జలుబు, ఒంటినొప్పులతో బాధపడుతున్న ఆయనకు ఆసుపత్రిలో చికిత్సలు చేయించారు. ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు.

Updated Date - 2020-08-04T10:52:38+05:30 IST