మురుగునీటి కాల్వలో పడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-02-25T05:26:50+05:30 IST

మురుగునీటి కాల్వలో పడి ఒకరు మృతిచెందిన సంఘటన జహీరాబాద్‌ పట్టణంలోని రాచన్నపేటకాలనీలో బుధవారం వెలుగు చూసింది.

మురుగునీటి కాల్వలో పడి ఒకరి మృతి

జహీరాబాద్‌, ఫిబ్రవరి 24: మురుగునీటి కాల్వలో పడి ఒకరు మృతిచెందిన సంఘటన జహీరాబాద్‌ పట్టణంలోని రాచన్నపేటకాలనీలో బుధవారం వెలుగు చూసింది. పట్టణ ఎస్‌ఐ నోముల వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హోతి(బి)గ్రామానికి చెందిన మహబూబ్‌(31) ప్రతీరోజూ కూలీపనుల నిమిత్తం జహీరాబాద్‌కు వెళ్తుంటాడు. మంగళవారం కూడా జహీరాబాద్‌కు వెళ్లాడు. కానీ ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రాచన్నపేటకాలనీలో మృతదేహమై కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మహబూబ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Updated Date - 2021-02-25T05:26:50+05:30 IST