యూఎస్ స్కూల్‌లో కాల్పులు.. ఒకరు మృతి !

ABN , First Publish Date - 2021-04-13T15:59:48+05:30 IST

అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలో సోమవారం ఓ స్కూల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి.

యూఎస్ స్కూల్‌లో కాల్పులు.. ఒకరు మృతి !

టేనస్సీ: అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలో సోమవారం ఓ స్కూల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. టేన్నసీ రాష్ట్రం నాక్సివిల్లే నగరంలోని ఆస్టిన్ ఈస్ట్ మాగ్నెట్ హై స్కూల్‌లో మధ్యాహ్నం 3.15 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో పలువురు విద్యార్థులు గాయపడగా.. ఒకరు మృతి చెందినట్టు నాక్సివిల్లే పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ అధికారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక తీవ్రంగా గాయపడిన ఇద్దిరిలో ఒకరు మృతి చెందగా, మరో విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని విచారిస్తే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఇటీవల అధ్యక్షుడు జో బైడెన్ తుపాకీ సంస్క‌ృతికి అడ్డుకట్టవేయాలని కీలక ప్రతిపాదన చేసిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.  

Updated Date - 2021-04-13T15:59:48+05:30 IST